పాఠశాల బాలికపై పది మంది అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన సంఘటన తమిళనాడు కోయంబత్తూర్ లో చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేయగా మరో ముగ్గ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక తల్లిదండ్రులు భవన నిర్మాన కార్మికులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారని, అయితే బాలిక తన తరగతిలో స్నేహితుడితో ప్రేమ సాగుతుండడంతో బాలికకు మాయ మాటలు చెప్పి స్నేహితుడితో పాటు మరో ముగ్గురు స్నేహితులు ఆమెతో స్నేహంగా ఉంటున్నట్లు నటించి ఆమెపై అత్యాచారం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read Also: Lockdown Extended: ప్రజలకు ప్రధాని మోదీ 7 కీలక సూచనలు


మరోవైపు ఆరుగురు యువకులు బాలికపై ఆరు నెలల నుంచి పలుమార్లు అత్యాచారం చేశారని, దీంతో బాలిక గర్భం దాల్చిందని, దగ్గర్లోని ఆసుపత్రికి తరలించడంతో అసలు విషయం బయటపడటంతో తల్లిదండ్రులు ఆశ్యర్యపోయారు. అబార్షన్ చేయాలని తల్లిదండ్రులు కోరడంతో వైద్యులు నిరాకరించారు. దీంతో అదే రోజు సాయంత్రం ఆస్పత్రి నుంచి తప్పించుకోవడంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలికను పట్టుకున్నారు. బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆమెపై అత్యాచారం చేసిన నలుగురు విద్యార్థులను జువైనల్ హోమ్‌కు తరలించగా మిగిలిన  నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.


 Bikiniలో అందాల భామ హాట్ ఫొటోలు


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Pics: ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos