కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ పూర్తి కావస్తుంది. ముఖ్యమంత్రిగా సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించనున్న ఈ సినిమా ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అందరిలో ఆసక్తిని రేకెత్తించే పోస్టర్స్‌ను వదులుతూ వస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే 'భరత్ అనే నేను' చిత్ర యూనిట్ నుంచి.. రేపు సాయంత్రం 6 గంటలకు 'ది విజన్ ఆఫ్ భరత్' ను పరిచయం చేయనున్నట్టు చెబుతూ .. కొత్తగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మహేష్ బాబు కూడా ఇదే విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులకు తెలిపారు. కాన్ఫరెన్స్ హాల్లో ఒంటరిగా నుంచుని కుర్చీపై చెయ్యేసి దీర్ఘంగా ఆలోచిస్తూ మహేశ్ ఈ ఫోటోలో కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంలోని వాక్యాలు గుర్తొస్తున్నట్టుగా.. ఆయన మనసంతా గందరగోళంగా వున్నట్టుగా ఈ ఫోటోలో మహేష్ బాబు హావభావాలు కనిపిస్తాయి. ఇదిలా ఉంచితే .. 'ది విజన్ ఆఫ్ భరత్' అనే పేరుతో రేపు సాయంత్రం 6 గంటలకు ఈ చిత్ర యూనిట్ ఏం చేయబోతోందని అందరిలో ఆసక్తి నెలకొంది.