మహేష్ బాబు నటించిన "అతడు" చిత్రం ఎంత సూపర్ హిట్ సినిమానో మనందరికీ తెలిసిందే విషయమే. ఆ సినిమాలో డైలాగులు కూడా అంతే పాపులర్. అయితే ఇటీవలే డల్లాస్ ప్రాంతంలో జరిగిన 'మా' వేడుకల్లో మెగాహీరో వరుణ్ తేజ్, "అతడు" సినిమాలోని డైలాగ్ చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు.  ‘గన్ను చూడాలనుకోండి తప్పులేదు.. కానీ బులెట్ చూడాలనుకోవద్దు చచ్చిపోతావు’ డైలాగ్ చెప్పి అభిమానుల కరతాళధ్వనుల మధ్య అందరినీ అలరించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వేడుకలో వరుణ్, అల్లు అర్జున్ పాటకు ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి స్టెప్పులు కూడా వేశాడు. సీటీమార్ పాటకు డ్యాన్స్ వేసి అందరినీ అలరించాడు. వరుణ్ తేజ ప్రస్తుతం ఫిదా, తొలి ప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే సంకల్ప రెడ్డి దర్శకత్వంలో రూపొందే మరో సినిమాకి సైన్ చేశాడు