గద్దలకొండ గణేష్ సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చిన వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే మంచు లక్ష్మి హోస్టింగ్ చేస్తోన్న 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వరుణ్ తేజ్... షోలో ఆమె అడిగిన అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు అంతే ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. అందులో వరుణ్ తేజ్‌ను ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఏంటంటే.. సాయి పల్లవి, రాశి ఖన్నా, పూజా హెగ్డే .. ఈ ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు.. ఎవరిని చంపేస్తావు.. ఎవరితో డేటింగ్ చేస్తావు అని అడిగి వరుణ్ తేజ్‌ని మంచు లక్ష్మి ఇరకాటంలో పెట్టింది. 


మంచు లక్ష్మి అడిగిన ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ స్పందిస్తూ.. సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేశాడు. రాశి ఖన్నాను చంపేస్తానని, పూజా హెగ్డేతో డేటింగ్ చేస్తానని సమాధానం ఇచ్చాడు. వరుణ్ చెప్పిన సమాధానం విన్న ఆడియెన్స్.. అతడు ఫిదా బ్యూటీ సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటాడట అంటూ చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాల్లో ఇప్పుడు ఇది కూడా ఒకటైపోయింది.