Asafoetida Benefits: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో ప్రతి నలుగురిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారని వైద్య నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి  చాలా రకాల  ఉత్పత్తుల మార్కెట్‌లో లభిస్తున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. అయితే అధిక రక్త పోటు నుంచి ఉపశమనం పొందడానికి  ఇంగువను వాడాలని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొన్నారు. ఇంగువలో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా శరీరంలోని రక్తపోటును నియంత్రించేందుకు కృషి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రక్తపోటు ఉన్న రోగులు ఇంగువను ఇలా ఉపయోగించాలి:


ఆహారంలో ఇంగువను వినియోగించండి:
 
ఇంట్లో తయారు చేసే ప్రతి వంటలో ఇంగువను వాడొచ్చు. ముఖ్యంగా  పప్పులను వండే క్రమంలో దీనిని ఉపయోగించవచ్చు. వంటకాల్లో ఇంగువను వినియోగించడం వల్ల రుచి పెరగడమే కాకుండా బీపీ కూడా అదుపులో ఉంచుతుంది.


తేనె, పొడి అల్లం, ఇంగువ:


రక్తపోటు ఉన్నవారు తేనెలో పొడి అల్లం పొడిని, ఇంగువను వేసికుని ఈ మిశ్రమాన్ని తినొచ్చు. ఇది ఆస్తమా, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా BPని కూడా నియంత్రణలో ఉంచుతుంది.


సెలెరీ, రాక్‌ సాల్ట్, ఇంగువ:


సెలెరీ, రాక్‌ సాల్ట్, ఇంగువ  ఈ మూడింటిని గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగితే... కడుపుకు సంబంధించిన అన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కడుపు ఉబ్బరం, పొట్టలో గ్యాస్ సమస్యలు, అధిక BP వంటి సమస్యలు తొలగిపోతాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)



 


Also Read: Body Detox Drink: ఉదయాన్నే ఈ డ్రింక్స్‌ తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి..!


Also Read:  Jamun Side Effects: నేరేడు పళ్లు తినేటప్పుడు ఈ తప్పులు చేయకండి, లేకపోతే మీకే నష్టం!


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.