Diabetes Control In 8 Days: మధుమేహం అనేది తీవ్ర దీర్ఘకాలిక వ్యాధి. దీని బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే ఈ వ్యాధితో బాధపడుతున్నవారు రక్తంలో చక్కెర పరిమాణాలు నియత్రించుకోలేకపోతే ప్రాణాంతకంగానూ మారొచ్చు. కాబట్టి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజూ వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కొత్త లక్షణాలకు గురవుతున్నారు. మధుమేహం వచ్చే వారిలో కొత్త లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్‌తో బాధపడుతున్నవారిలో ఎర్లీ మార్నింగ్ వచ్చే లక్షణాలు ఇవే:
ప్రస్తుతం చాలా మందిలో ఉదయం  పూట రక్తంలో చక్కెర పరిమాణాలు హెచ్చు తగ్గుల కారణంగా తీవ్ర సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా మైకం వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అలసట, తలనొప్పి, వికారం వంటి సమస్యలు కూడా వచ్చే ఛాస్స్‌ ఉంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది.


ఎర్లీ మార్నింగ్ ఇలాంటి లక్షణాలు రాకుండా ఉండడానికి ఇలా చేయండి:
మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజూ వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. ఒత్తిడిని తగ్గించే పనులు చేయడం వల్ల కూడా ఇలాంటి లక్షణాల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది మధుమేహం ఉన్నవారు ఈ కింది ప్రశ్నలతో సతమతమవుతున్నారు. అయితే ఈ ప్రశ్నలకు ప్రముఖ నిపుణులు సమాధానాలు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం..


తరచుగా అడిగే ప్రశ్నలు:
ప్ర: మధుమేహం అంటే ఏమిటి?

 మధుమేహం అనేది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేసే దీర్ఘకాలిక పరిస్థితులని నిపుణులు చెబుతున్నారు.


ప్ర: మధుమేహానికి కారణమేమిటి?
 మధుమేహం జన్యు పరంగా, జీవనశైలి అలవాట్లు, పర్యావరణ కారకాల కారణంగా కూడా ఈ సమస్యలు వస్తాయి.


ప్ర: మధుమేహం వచ్చే ప్రమాదం ఎవరికి ఉంటుంది?
అధిక బరువు ఉన్నవారు, కుటుంబంలో ఇంత వరకు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారిలో మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.


ప్ర: మధుమేహాన్ని ఎలా నిర్ధారిస్తారు?
మధుమేహం సాధారణంగా రక్తంలో చక్కెర స్థాయిలను కొలిచే రక్త పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు.


ప్ర: మధుమేహం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి?
మధుమేహం సమస్యల కారణంగా నరాలు దెబ్బతినడం, కంటి సమస్యలు, మూత్రపిండాలు దెబ్బతినడం, హృదయ సంబంధ వ్యాధులు వస్తాయి.


మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. అంతేకాకుండా అల్పాహారంలో తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. తరచుగా పై లక్షణాలతో బాధపడేవారు వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర వ్యాధిగా మారి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ధూమపానం, మద్యపానం చేయడం మానుకోవాల్సి కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మధుమేహం ఉన్నవారు జాగ్రత్తలు పాటిస్తూ జీవనం గడపాల్సి ఉంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు


Also Read: Earthquak Today: ఢిల్లీ, చెన్నై నగరాల్లో భూకంపం.. భయాందోళనలో ప్రజలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి