Tihar Jail Corona: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో (Delhi Covid Cases) అయితే విపరీతంగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ నియంత్రణ దేశం కేజ్రీవాల్ సర్రారు వీకెండ్ కర్ఫ్యూను అమలు చేస్తోంది. తాజాగా ఢిల్లీలోని జైళ్లలో 66 మంది ఖైదీలు, 48 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇటీవ‌లే పార్ల‌మెంట్‌లో (Parliament) 400 మంది సిబ్బందికి, సుప్రీంకోర్టులో (Supreme Court) 150 మంది సిబ్బందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తీహార్ జైల్లో (Tihar Jail) క‌రోనా క‌ల‌క‌లం రేగింది. 42 మంది ఖైదీలు, 34 మంది సిబ్బందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో మండోలి జైలులో 24 ఖైదీలు, 8 మంది సిబ్బందికి క‌రోనా సోకిన‌ట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడి రోహిణి జైల్లో కూడా ఆరుగురు సిబ్బందికి కొవిడ్ వచ్చింది. క‌రోనా సోకిన ఖైదీలు, జైలు సిబ్బందికి ప్ర‌స్తుతం స‌ప‌రేట్‌గా ఉంచి చికిత్స అందిస్తున్నారు. 


Also Read: BJP chief tests positive : వరుసగా కోవిడ్ బారినపడుతోన్న బీజేపీ నేతలు.. అధ్యక్షుడికి కరోనా!


దేశంలో గడిచిన 24 గంటల్లో 1,68,063 మందికి కరోనా (Corona cases in India) సోకింది. వైరస్ తో 277 మంది మృతి చెందారు. మరోవైపు 69,959 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 7,23,619 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల (Omicron Cases in India) సంఖ్య 4,461కు చేరింది. ఒమిక్రాన్ నుంచి 1,711 మంది బాధితులు కోలుకున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి