కొజికోడ్: దుబాయ్ నుంచి కేరళలోని కొజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి ( AI flight ) కొజికొడ్‌కి సమీపంలోని క్యారిపూర్ ఎయిర్ పోర్టు రన్‌వేపై ప్రమాదం జరిగింది. రాత్రి 7:45 నిమిషాలకు విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారింది. దీంతో విమానం రెండు ముక్కలవడంతో పాటు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. విమాన ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో పది మంది చిన్నారులు ఉన్నారు. ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్ క్రూ సిబ్బంది ఉన్నారు.