45 మంది పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న ఓ స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఓ కుంటలో బోల్తా పడిన దుర్ఘటనలో 20 మంది చిన్నారులు గాయపడినట్టు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని సిద్ధార్థ్ నగర్‌కి సమీపంలోని ఖైరా గ్రామంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాయపడిన చిన్నారులను రక్షించి ఆస్పత్రికి తరలించారు. బస్సు బోల్తా పడిన కుంటలో నీళ్లు ఉండటంతో గాయపడిన చిన్నారుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ ఘటన వెనుకున్న కారణాలు, మిగతా చిన్నారుల పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.