పశ్చిమ బెంగాల్‌లో లోక్ సభ ఎన్నికలు మరోసారి హింసాత్మకంగా మారాయి. చివరి రెండు విడతల్లో జరిగిన పోలింగ్‌లో పశ్చిమ బెంగాల్‌లోనే అధికంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా 5వ విడత పోలింగ్‌లో సైతం పలుచోట్ల వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య పరస్పర దాడులు చోటుచేసుకున్నాయి. బరాక్‌పూర్‌లో ఎన్నికల్లో చెలరేగిన హింసను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల బృందంపై సైతం అల్లరిమూకలు దాడికి పాల్పడ్డాయి. 


అల్లరిమూకల దాడిలో జీ మీడియా గ్రూప్‌నకు చెందిన 24 గంట న్యూస్ ఛానెల్ విలేకరి కమలికకు గాయాలయ్యాయి. పలు మీడియా వాహనాల అద్దాలు సైతం ధ్వంసమయ్యాయి.