Bengal Woman Shoots Boyfriend: బంగాల్‌ బర్ధమాన్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తి తనను దూరం పెడుతున్న కారణంగా ఏకంగా అతడిపై కాల్పులకు తెగబడింది ఓ యువతి. నాలుగేళ్ల పాటు కలసి ఉన్న తమ బంధాన్ని పట్టించుకోకుండా.. తనను దూరం పెడుతున్నాడని ఆమె ఆరోపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధవారం రాత్రి బంగాల్ లోని కత్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసియా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే బుల్లెట్ బాధితుడి పొత్తికడుపును తాకుతూ వెళ్లిందని.. దీనితో పెద్దగా ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. 


ఏం జరిగిందంటే?


ఉద్యోగం కోసం కొన్ని నెలల క్రితం ఝార్ఖండ్ వెళ్లిన నిందితురాలు.. ఇటీవలే స్వగ్రామానికి వచ్చింది. ఈ క్రమంలో తన ప్రియుడిని కలవాలని ఉందని.. స్థానిక సర్కస్ మైదానానికి రమ్మని కోరింది. అతను వెళ్లిన అనంతరం ఈ దారుణానికి పాల్పడింది.


"నేను మైదానానికి వెళ్లగానే ఆమె నన్ను కౌగిలించుకుంది. ముద్దు పెట్టుకుంది. కలసి సిగరెట్లు కాల్చాం. ఏమైందో ఏమో.. తుపాకీ తీసి అమాంతం నాపై కాల్పులు జరిపింది" అని ఆ బాధితుడు వాపోయాడు. 


కాల్పుల అనంతరం అక్కడినుంచి పారిపోయిన మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమె వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య దూరం పెరగడం వల్లే మహిళ ఈ దారుణానికి పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.  


Also Read: Corona cases in India: దేశంలో తగ్గిన కరోనా కేసులు- మరణాల్లో స్వల్ప వృద్ధి


ALso Read: Sheena Bora: షీనా బోరా కశ్మీర్‌‌లో బతికే ఉందంటోన్న ఇంద్రాణి ముఖర్జి.. సీబీఐకి లేఖ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook