భువనేశ్వర్: సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు ''తమ రాష్ట్ర ప్రజల కోసమో లేక తమ ప్రాంత ప్రజల కోసమో లేదంటే తమ దేశ ప్రజల కోసమో ప్రతిపక్షాలతో పోరాటడానికి తాము సిద్ధమే'' అని సాధారణంగా నేతలు చెబుతుండటం సర్వసాధారణంగా చూస్తుంటాం. అయితే, ఒడిషా ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ మాత్రం ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఎక్సర్‌సైజ్‌లే చేయడం మొదలుపెట్టారు. అవును, రాష్ట్ర ప్రజల తరపున, వారి కోసం పోరాడటానికి తాను సిద్ధమవుతున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నట్టుగా ఉన్న ఓ వీడియో విడుదల చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


బిజు జనతా దళ్ పార్టీ విడుదల చేసిన ఈ వీడియోలో సీఎం నవీన్ పట్నాయక్ జాగింగ్ చేస్తూ ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్న దృశ్యాలను చూడొచ్చు.