Vehicle Falls Into Gorge in Uttarakhand: ఉత్తరాఖండ్ లో (Uttarakhand) ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయిన (Vehicle Falls Into Gorge) ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. సుఖిధాంగ్ రీతా సాహిబ్ రహదారిపై (Sukhidhang Reetha Sahib road) ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండంగా ఈ దుర్ఘటన జరిగినట్లు కుమావోన్ డీఐజీ నీలేష్ ఆనంద్ భర్నే తెలిపారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలేం జరిగిందంటే...
 పంచముఖి ధర్మశాలకు చెందిన లక్ష్మణ్ సింగ్ కుమారుడు మనోజ్ సింగ్​ పెళ్లికి వీరంతా బయలుదేరి వెళ్లారు. అనంతరం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మహేంద్ర మ్యాక్స్ వాహనంలో వీరంతా తిరిగి తమ స్వస్థలాలకు బయలుదేరారు. తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో వాహనం అదుపుతప్పి..రోడ్డు పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. మృతులంతా లక్ష్మణ్ సింగ్ బంధువులేనని పోలీసులు వెల్లడించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు..క్షతగాత్రులను చంపావత్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. 


Also read: Lalu Prasad Yadav Health: లాలూ ప్రసాద్ యాదవ్‌కి సీరియస్.. రిమ్స్‌లో చేరిక..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook