CM Basavaraj Bommai praises BS Yediyurappa: బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప ప్రజారంజకమైన పరిపాలన అందించారని కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ప్రశంసలు కురిపించిన ఆయన.. ఆర్థిక సంక్షోభంలోనూ యడియూరప్ప తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వాన్ని ముందుండి నడిపించారని కితాబిచ్చారు. అందుకే తాను కూడా యడియూరప్ప అడుగుజాడల్లోనే నడవనున్నట్టు బసవరాజ్ తెలిపారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Basavaraj Bommai takes oath: బసవరాజ్ బొమ్మై ప్రమాణస్వీకారం పూర్తి


కర్ణాటక ముఖ్యమంత్రిగా తన తదుపరి కార్యక్రమాలపై బసవరాజ్ బొమ్మై (Karnataka CM Basavaraj Bommai) మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరదల్లో నష్టపోయిన వారికి అండగా నిలుస్తామని అన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరానని, ఆయన నుంచి పిలుపు రాగానే వెళ్లి కలుస్తానని (CM Basavaraj Bommai to meet PM Narendra Modi) తెలిపారు.


Also read : Vaccine Antibodies: కోవిడ్ వ్యాక్సిన్ ప్రభావం తగ్గిపోతుందా..ఆ అధ్యయనం ఏం చెబుతోంది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook