తమిళనాడు తిరుపత్తూర్ లోని  ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో హెడ్మాస్టర్ పై 9వ తరగతి చదువుతున్న విద్యార్ధి పదునైన పరికరంతో దాడి చేశాడు. ఈ ఘటనలో హెడ్మాస్టర్ ఆర్.బాబు(52) తలకు, పొట్టకు గాయాలయ్యాయి. వెంటనే తోటి ఉపాధ్యాయులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం స్కూల్ ఆవరణలో చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న 5గురు విద్యార్థులు స్కూల్ ఎగ్గొట్టే దృశ్యాలను హెడ్మాస్టర్ చూశాడు. అక్కడి నుంచి నలుగురు విద్యార్థులు పారిపోగా.. ఒక విద్యార్థిని హెడ్మాస్టర్ పట్టుకున్నాడు.  ఖాళీగా ఉన్న తరగతి గదిలోకి పట్టుకొచ్చి క్లాసులకు ఎందుకు హాజరుకావటం లేదని ప్రశ్నించి దేహశుద్ధి చేశాడు. ఈ సమయంలోనే ఆ విద్యార్ధి పదునైన పరికరం తీసుకొని హెడ్మాస్టర్ పై దాడి చేసి తరగతి గది నుంచి పారిపోయాడు.


హెడ్మాస్టర్ అరుపులు విన్న టీచర్లు వెంటనే అక్కడికి చేరుకొని ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దాడి చేసిన బాలుడి కోసం గాలిస్తున్నారు.