న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు కారణంగా పలురైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. 17 రైళ్లు రద్దుకాగా.. 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. 6 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు రైల్వే అధికారులు. రైలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణీకులు ఇక్కట్లకు గురైతున్నారు. ఢిల్లీలో అధిక కాలుష్య స్థాయికి తోడు పొగమంచు కూడా తోడవడంతో వెలుతురులేమి సమస్య తీవ్రమైంది.