న్యూఢిల్లీ: లండన్‌లో నిరవ్ మోడీ అరెస్ట్ అవడంపై కాంగ్రెస్ పార్టీ తనదైన స్టైల్లో స్పందించింది. నిరవ్ మోడీ దేశం నుంచి పారిపోయేందుకు సహకరించిన బీజేపీనే ఇవాళ ఆయన్ని మళ్లీ దేశానికి రప్పిస్తోంది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఆరోపించారు. అంతేకాకుండా దేశంలో ఎన్నికలు ముగిసిన అనంతరం మళ్లీ నిరవ్ మోడీ దేశం విడిచిపారిపోయేందుకు సహకరిస్తారని గులాంనబీ ఆజాద్ పేర్కొన్నారు.