న్యూఢిల్లీ: ఆదివారం ఢిల్లీలో మరో దుర్ఘటన జరిగింది. నలుగురు జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఆటగాళ్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం ఉదయం నాలుగు గంటలకు ఢిల్లీ మరియు హర్యానా మధ్య సింధు సరిహద్దుకు సమీపంలోని అలిపూర్ గ్రామంలో పొగమంచు కారణంగా జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ప్రమాదంలో నలుగురు పవర్ లిఫ్టింగ్ ఆటగాళ్లు మరణించారు. దేశంలో 2017 పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ లో బంగారు పతకాన్ని సాధించిన సాక్షం యాదవ్, మరో ఆటగాడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స కోసం న్యూఢిల్లీ షాలిమార్ బాగ్ లోని మాక్స్ హాస్పిటల్ కు తరలించారు. దట్టమైన పొగమంచు ఉన్నప్పటికీ కారును అతివేగంతో నడపడంవల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.