ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. మదన్ లాల్ ఖురానా మృతిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తమ ట్విటర్ ద్వారా ఖురానా మృతి దుర్వార్తను వెల్లడించింది.