Minor Boy Arrested In Delhi: ఢిల్లీలోని ద్వారకలో దారుణం జరిగింది. ఓ మహిళపై అత్యాచారం చేసిన ఆరోపణల నేపథ్యంలో 17 ఏళ్ల బాలుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిజాన్ని రాబట్టారు. మహిళను అత్యాచారం జరిపి, హత్య చేసినట్లు బాలుడు అంగీకరించాడు. బాధితురాలి కుటుంబం సమాచారాన్ని అందించేందుకు మహిళ ఫొటోలను ఢిల్లీ పరిధిలోని అన్నీ పోలీస్ స్టేషన్లకు పంపారు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడ్ని అరెస్టు చేశారు. పోస్ట్ మార్టమ్ రిపోర్టు పోలీసులకు చేరాల్సిఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


నవంబరు 15న ద్వారకలోని చెత్తకుప్ప సమీపంలో మహిళ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నవంబరు 17న నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు చేసిన తమదైన శైలీలో విచారణ చేయగా.. మహిళపై అత్యాచారం చేసినట్లు ఆ బాలుడు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. దొరికిపోతానేమోననే భయంతో ఆమె గొంతు నులిమి హత్య చేసి, సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు తెలిపాడు. మహిళ రహస్య భాగాలకు నిప్పంటిచ్చినట్లు తెలిపాడు. 


Also Read: ధన్​బాద్​లో ఘోర ప్రమాదం...ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి..


Also Read: భారత్ లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 543 రోజుల కనిష్టానికి కొత్త కేసులు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook