ప్రంచండ వేగంతో పయనిస్తున్న ఫోనీ ఈస్ట్ కోర్టు రీజియన్ ను ఇప్పటికే అతలాకతలరం చేసింది. తీరం దాటినా వెనక్కి ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ 200 కి.మీ వేగంతో విరుచుకుపడుతోంది. ఫోనీ దాటికి ఏపీ, ఒడిషాలోని చాలా ప్రాంతాలు తీరని నష్టాన్ని చవిచూశాయి. ఇది చాలదన్నట్లు బెంగాల్, జార్ఖండ్ పై కూడా ప్రతాపం చూపిస్తోంది. ఫొనీ ప్రభావంతో ఆ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కూరుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుపాను బాలాసోర్ మీదుగా కోల్ కతా  దాటుకుంటూ బంగ్లాదేశ్ దిశగా పయనిస్తున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.