Farmers Protests Live Updates: న్యూఢిల్లీ: కేంద్రం, రైతు సంఘాల నాయకుల మధ్య తొమ్మిదోసారి జరిగిన చర్చలు కూడా అసంపూర్ణంగానే ముగిశాయి. ఎప్పటిలాగానే రైతులతో మరోసారి భేటీ ఉంటుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల (Farm laws) ను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు 50రోజులకు పైగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రైతు సంఘాలు (Farmers Organizations), కేంద్రం మధ్య ఎనిమిది సార్లు జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో జనవరి 12న సుప్రీంకోర్టు ఈ చట్టాలపై స్టే విధించడంతోపాటు కమిటీ కూడా వేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే చర్చలు ఓ కొలిక్కి వస్తాయని అందరూ భావించినప్పటికీ.. ఎప్పటిలాగానే శుక్రవారం కూడా అసంపూర్ణంగానే ముగిశాయి. అయితే మరోసారి 19న మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి రైతు సంఘాల నాయకులతో చర్చలుంటాయని మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చర్చల వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తీవ్రమైన చలిలో రైతులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం ఆందోళన చెందుతోందని ఆయన పేర్కొన్నారు. తదుపరి పదోసారి జరిగే చర్చలు ఓ కొలిక్కి వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు కమిటీ ముందు తాము మాత్రం ప్రభుత్వం తరుపున హాజరై వివరణ ఇస్తామని తోమర్ స్పష్టంచేశారు. Also Read: Bird Flu: మహారాష్ట్రలో విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ


ఇదిలాఉంటే.. సుప్రీం కోర్టు కమిటీ ఎదుట తాము హాజరుకామని రైతుసంఘం నాయకుడు టికాయత్ పేర్కొన్నారు. తాము కేంద్రంతోనే (Central Government) చర్చలు జరుపుతామని చర్చల అనంతరం మీడియాకు వెల్లడించారు. Also Read: Budget Session: 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook