2024 Budget On Health Sector: ఆరోగ్య రంగంలో నిర్మలా సీతారామన్‌ ప్రసంగిస్తూ..పేదలు, యువత, మహిళలు, అన్నదాతపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో మహిళల కోసం ప్రభుత్వం ప్రకటనలు చేసింది. అందులో గర్భాశయ క్యాన్సర్‌కు వ్యాక్సినేషన్‌ను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే ఈ వ్యాధిని ఎదుర్కోవడానికి తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్లు గల బాలికలకు టీకాలు వేస్తామని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే అంగన్‌వాడీలు, పోషకాహారం 2.0 పౌష్టికాహార పంపిణీ, బాల్య సంరక్షణ, అభివృద్ధిని వేగవంతం చేస్తుందని తెలిపారు ఆర్థిక మంత్రి. అంతేకాకుండా త్వరలో U-win యాప్  దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందని తెలియజేశారు. మిషన్ ఇంద్రధనుష్‌ టీకాని U-win యాప్ ద్వారా ముందుకు తీసుకువెళతారని చెప్పారు.


ఈ బడ్జెట్‌లో ఆశా, అంగన్‌వాడీలకు శుభవార్త తెలిపారు ఆర్థిక మంత్రి. ప్రధాని ప్రవేశపెట్టిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద ఆరోగ్య కవరేజీలు అన్నిఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు విస్తరిస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్‌లో మరికొన్ని పెద్ద విషయాల గురించి ప్రసంగించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్‌లో పన్ను రేట్లు మారుతూ ఉంటాయి. కానీ ఈసారి  పన్ను రేట్లలో ఎలాంటి మార్పు జరగలేదు. అలాగే Fy25లో 11 లక్షల కోట్ల క్యాపెక్స్‌ను ప్రకటించారు. మధ్యంతర బడ్జెట్ 2024 రూఫ్‌టాప్ సోలార్ ద్వారా కోటి గృహాలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తుంది. భారతదేశం 2030 నాటికి  100 మెట్రిక్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేసి ద్రవీకృతం చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.


Also readAyodhya Ram Mandir Darshan: బాలరాముని దర్శనానికి భారీ రద్దీ.. ఆలయ సమయంలో మార్పులు.. కొత్త షెడ్యూల్ ఇదే...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook