న్యూఢిల్లీ: నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయుష్ గోయల్ కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్‌కు చేరుకున్నారు. పార్లమెంట్‌లోకి ప్రవేశిస్తూ ఈ సందర్భంగా అక్కడే వున్న మీడియాకు బడ్జెట్ బ్రీఫ్‌కేస్ చూపిస్తూ లోపలికి వెళ్లిపోయారు. అంతకన్నా ముందుగా రాష్ట్రపతి భవన్‌కి వెళ్లి అక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు.