India Corona Cases today: దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. గడిచిన 24 గంట్లలో కొత్తగా 18,257‬ కొవిడ్ కేసులు (Corona Cases in India) వెలుగు చూశాయి. వైరస్ బారిన పడి మరో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.  కరోనా నుంచి 14, 553 మంది కోలుకున్నారు. మెుత్తం రికవరీ అయిన వారి సంఖ్య 98.50 శాతానికి చేరింది. టోటల్ కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.30 శాతంగా ఉంది. డైలీ పాజిటివీటీ రేటు 4.22 శాతంగా నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఇప్పటివరకు నమోదైన మెుత్తం కేసుల సంఖ్య 4,36,22,651‬ కాగా.. టోటల్ మరణాల సంఖ్య 5,25,428గా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,28,690 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న మరో  4,32,777 మందికి కరోనా టెస్టులు చేశారు. భారత్ లో కొవిడ్ టీకా కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. శనివారం 10,21,164 మందికి వ్యాక్సిన్లు వేశారు. దీంతో  ఇప్పటివరకు పంపిణీ చేసిన  టీకా డోసుల సంఖ్య 1,98,76,59,299గా నమోదైంది. 



వరల్డ్ వైడ్ గా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 4,81,875 మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మహమ్మారితో మరో 844 మంది ప్రాణాలు విడిచారు. ఇటలీ కరోనా విజృంభణ కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 98,044 కరోనా కేసులు వెలుగు చూడగా...వైరస్ తో మరో 105 మంది మరణించారు. 


Also Read: Nupur Sharma: నుపుర్ శర్మ నాలుక కోస్తే రూ.2 కోట్ల రివార్డు..వీడియో వైరల్..వ్యక్తి అరెస్ట్..! 



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook