న్యూ ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) చైర్మన్ సంజీవ్ సింగ్ వాహనదారులకు షాక్ ఇచ్చారు. ఐఓసీఎల్ చైర్మన్ సంజీవ్ సింగ్ చెప్పిన వివరాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఇంధనం ధరలు పెరగనున్నాయని పీటీఐ ఓ కథనంలో పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ''లో ఎమిషన్ BS-VI'' పరిజ్ఞానం కలిగిన ఇంధనాన్ని అందుబాటులో తీసుకొస్తున్నామని సంజీవ్ సింగ్ పీటీఐకి తెలిపారు. ఈ సరికొత్త ఇంధనం తయారీకి అవసరమైన అధునాతన పరిజ్ఞానం వినియోగం కోసం తమ రిఫైనరీలపై రూ.17,000 కోట్ల వరకు వెచ్చించామని.. అందువల్లే ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్న లో ఎమిషన్ బిఎస్-VI పెట్రోల్, డీజిల్‌కి ధరలు కూడా పెరుగుతాయని సంజీవ్ సింగ్ అన్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMC) అన్నీ ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం కోసం రూ.35,000 కోట్లు ఖర్చుపెడితే... అందులో ఒక్క ఐఓసిఎల్ చేసిన ఖర్చే రూ.17,000 కోట్లు ఉందని సంజీవ్ సింగ్ పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లో ఎమిషన్ BS-VI ఇంధనం సరఫరా అవుతున్న అన్ని దేశాల్లోనూ అక్కడి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మామూలు ఇంధనం ధరల కంటే అధికంగానే చార్జ్ చేస్తున్నాయని సంజీవ్ వెల్లడించారు.


లో ఎమిషన్ BS-VI ఏంటంటే...
సంజీవ్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న పెట్రోల్, డీజిల్‌లో 50 పార్ట్స్ పర్ మిలియన్ (50 parts per million (ppm)) కలిగి ఉంటుంది. అదే ఎప్రిల్ 1 నుంచి అందుబాటులోకి రానున్న లో ఎమిషన్ బిఎస్-VI ఇంధనంలో (low emission BS-VI fuels) 50 పార్ట్స్ పర్ మిలియన్ (10 parts per million (ppm)) కలిగి ఉంటుంది. అంటే బిఎస్-4 రకం ఇంధనంతో పోల్చుకుంటే.. బిఎస్-6 రకం ఇంధనంలో ఉండే సల్ఫర్, నైట్రోజెన్ ఆక్సైడ్ పరిమాణం ఐదు రెట్లు తక్కువగా ఉంటుంది. కాలుష్యానికి చెక్ పెట్టడానికి లో ఎమిషన్ బిఎస్-6 రకం ఇంధనం ఎంతో ఉపయోగపడనుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..