గుజరాత్‌ రాష్ట్రంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. అహ్మదాబాద్‌లోని నవరంగపుర కోవిడ్19 ఆసుపత్రి (COVID19 Hospital In Ahmedabad)లో గురువారం వేకువజామున ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. కోవిడ్ ఆసుపత్రిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురికి కాలిన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో ఉన్నవారు ప్రాణభయంతో భయటకు పరుగులు తీశారని స్థానికులు చెబుతున్నారు. TRS ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూత