గోవులను అక్రమంగా రవాణా, గోవులను చంపడం లాంటి చర్యలు చేస్తే చంపేస్తామంటూ రాజస్థాన్ కు చెందిన బీజేపీ రాంఘర్ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహుజా హెచ్చరించి పెద్ద దుమారానికి తెరలేపారు. ఆళ్వార్ లో గోవులను అక్రమంగా రవాణా చేస్తూ అరెస్టైన ఒక వ్యక్తిని ఉద్దేశిస్తూ శనివారం పైవిధంగా స్పందించారు.


జకీర్ అనే వ్యక్తి ఆళ్వార్ లో ఒక ట్రక్ లో ఎనిమిది గోవులను తరలిస్తూ పట్టుబడ్డాడు. అతన్ని అరెస్ట్ చేసే ముందు గ్రామస్థులు కొట్టారు. ఈ ఘటనలో అతని తలకు గాయాలయ్యాయి. అయితే అతన్ని ఎవ్వరూ కొట్టలేదని... ప్రజలు వెంబడిస్తుంటే.. ట్రక్ ను వేగంగా నడిపి అదుపుతప్పి కిందపడ్డాడని.. ఆ క్రమంలోనే ఆతనికి గాయాలయ్యాయని ఎమ్మెల్యే  జ్ఞాన్ దేవ్ అహుజా అన్నారు.