Corona Cases Today: దేశంలో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 37,379 కేసులు వెలుగుచూశాయి. మరో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా మరోవైపు 11,007 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ఇప్పటి వరకు 3,43,06,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొవిడ్ ధాటికి మొత్తంగా 4,82,017 మంది మరణించారు. ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం 1,71,830 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 



వ్యాక్సినేషన్


దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. సోమవారం మరో 99,27,797 డోసులు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,46,70,18,464 కు చేరింది.


ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు..


ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 13 లక్షల 32 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ధాటికి సోమవారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 4,297 మరణాలు సంభవించాయి.  


Also Read: Arvind Kejriwal - Covid 19: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా.. ఇంట్లోనే ఐసొలేషన్‌!!


Also Read: Train Viral News: ఓ వైపు వేగంగా రైలు దూసుకొస్తోంది.. పట్టాలపై పడుకున్నాడు.. ఏం జరిగింది?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి