India Corona Updates: దేశంలో కరోనా కేసులు (COVID-19 cases) పెరిగనట్టే పెరిగి..మళ్లీ తగ్గుముఖం పట్టాయి. ముందురోజు 19 వేలకు చేరువైన కొత్త కేసులు.. తాజాగా 16 వేలకు పడిపోయాయి. రోజువారీ కేసులు అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు(active COVID-19 cases) క్రమేపీ తగ్గుతున్నాయి. అయితే మరణాల్లో మాత్రం పెరుగుదల కనిపించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా 11,80,148 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,862 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 11 శాతం మేర తగ్గుదల కనిపించింది. నిన్న ఒక్కరోజే 19,391 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న 379 మంది కొవిడ్‌(Covid-19 deaths)తో మరణించారు. ఇప్పటివరకు 3.40 కోట్ల మంది మహమ్మారి(Coronavirus) బారిన పడగా.. అందులో 3.33 కోట్ల మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 98.07 శాతానికి చేరింది. క్రియాశీల కేసులు రెండు లక్షలకు చేరువయ్యాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 2.03 లక్షల(0.60 శాతం)కు చేరింది. 


Also read: Breaking: మావోయిస్టు అగ్రనేత ఆర్కే కన్నుమూత!


గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కరోనా టీకా(Covid-19 Vaccination) కార్యక్రమం వేగంగా సాగుతోంది. పండుగ వాతావరణం నెలకొనడంతో రెండు రోజులుగా ఆ వేగం తగ్గింది. నిన్న 30.26 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 97.14 కోట్ల చేరింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి