India Corona Update: దేశాన్ని విలవిల్లాడించిన కరోనా సెకండ్ వేవ్ క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. ఇండియాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా ఆ ఏడు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి చాలావరకూ అదుపులో వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ఉధృతి తగ్గుతోంది. మొన్నటి వరకూ రోజుకు 4 లక్షల వరకూ కేసులు నమోదై తీవ్ర విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్‌డౌన్ కారణంగా పరిస్థితి అదుపులో వచ్చింది. దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ కేసులు చాలా వరకూ తగ్గాయి. రోజుకు లక్ష వరకూ కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా పరిస్థితిని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. గత 24 గంటల్లో దేశంలోని మధ్యప్రదేశ్, రాజస్థాన్, న్యూ ఢిల్లీ, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, జార్ఘండ్ రాష్ట్రాల్లో రోజుకు వేయి లోపు కేసులే నమోదవుతున్నాయి.


కరోనా కట్టడికి వైద్యం, ఇతర మౌళిక సదుపాయల కల్పనకై తీసుకోవల్సిన చర్యలపై మంత్రి హర్షవర్ధన్ (Union minister Harsha vardhan) వివరాలు వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకూ 2 కోట్ల 89 లక్షల 9 వేల 975 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా.. 3 లక్షల 49 వేల 186 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 1 లక్షా 74 వేలమంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14 లక్షల 1 వేయి 609 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అటు జమ్ముకశ్మీర్, పంజాబ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 2 వేల కంటే తక్కువ కేసులున్నాయి. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. 


Also read: CA Examination Schedule: సీఏ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఐసీఏఐ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook