Corona updates: దేశంలో కరోనా కేసులు(Corona Cases in india) తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా కొవిడ్ కేసుల సంఖ్య 209 రోజుల కనిష్ఠానికి దిగొచ్చింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11.41లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు(Covid Tests) నిర్వహించగా.. 18,346 మందికి పాజిటివ్‌గా తేలింది. అయితే ఇదే సమయంలో మరణాలు(Covid-19 Deaths) పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతక్రితం రోజున మరణాల సంఖ్య 200 దిగువకు పడిపోగా.. తాజాగా నిన్న 263 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ రాష్ట్రంలోనే ఎక్కువ మరణాలు
అయితే ఇందులో సగానికి పైగా మరణాలు ఒక్క కేరళ(Kerala)లోనే నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న 8,850 కొత్త కేసులు వెలుగుచూడగా.. 149 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు 4,49,260 మందిని కొవిడ్‌కు బలి అయ్యారు. నిన్న మరో 29,639 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 3.31కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు(Recovery Rate) 97.93శాతానికి పెరిగింది. ఇక కొత్త కేసులు తగ్గుతుండటంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 200 రోజుల కనిష్ఠానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,52,902 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.75శాతంగా ఉంది. 


Also Read: Supreme Court: కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేల పరిహారం చెల్లించాల్సిందే..


దేశంలో వ్యాక్సినేషన్‌(Vaccination) ప్రక్రియ జోరుగా సాగుతోంది. నిన్న మరో 72.51లక్షల మందికి టీకాలు వేశారు. ఇప్పటివరకు 91.54కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించాయి. కొత్తగా 3,39,108 మందికి కరోనా (Corona update) సోకినట్లు తేలింది. మహమ్మారి​ ధాటికి మరో 4,808 మంది చనిపోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 23,61,65,564 కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 4,822,761కి పెరిగింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook