భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు వరుసగా మూడోరోజు 3 లక్షలకు దిగువన నమోదయ్యాయి. కానీ కోవిడ్19 మరణాలు ఆందోళన రేపుతున్నాయి. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు లాక్‌డౌక్, కర్ఫూ అమలు చేస్తున్నా కరోనా మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో తాజాగా 2,67,334 మంది కరోనా బారిన పడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,54,96,330 (2 కోట్ల 54 లక్షల 96 వేల 3 వందల 30)కు చేరింది. అదే సమయంలో గడిచిన 24 గంటల్లో 4,529కు మంది కోవిడ్19తో పోరాడుతూ చనిపోయారు. దేశంలో ఒక్కరోజులో నమోదైన కరోనా వైరస్ (CoronaVirus) మరణాలలో ఇదే అత్యధికం. దీంతో దేశంలో కరోనా బారిన పడి ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,83,7248కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరింత ఆలస్యం


దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజు 3,89,851 మంది కరోనా మహమ్మారిని జయించారు. భారత్‌లో ఇప్పటివరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 2,54,96,330 (2 కోట్ల 54 లక్షల 96 వేల 330)కి చేరింది. దేశంలో ప్రస్తుతం 32 లక్షల 26 వేల 719  యాక్టివ్ కరోనా కేసులున్నాయి. తాజాగా COVID-19 పాజిటివ్ కేసుల కన్నా డిశ్ఛార్జ్ కేసులు లక్షకు పైగా ఉండటం స్వల్ప ఊరటనిస్తోంది. దేశంలో ఇప్పటివరకూ 18 కోట్ల 58 లక్షల 26 వేల 719 మంది కోవిడ్19 టీకాలు తీసుకున్నారు. 


Also Read: Adar Poonawalla: కరోనా వ్యాక్సినేషన్ ఇప్పట్లో పూర్తి కాదు, సీరం సీఈవో ఆదార్ పూనావాలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook