india corona cases:  దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, ఇటీవల కాలంలో క్రియాశీల రేటు, రికవరీ రేటు మెరుగ్గా ఉండటం ఊరటనిస్తోంది. నిన్న 36 వేల కేసులు.. 500కు పైగా మరణాలు సంభవించాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనదేశంలో తాజాగా 18,86,271 మందికి కొవిడ్(Covid) నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 36,571 మందికి వైరస్‌(Corona Virus) నిర్ధారణ అయ్యింది. మొత్తం టెస్ట్‌ల(Covid Tests) సంఖ్య 50,26,99,702కి చేరింది.  ఒక్క కేరళ(Kerala)లోనే 20వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  మన దేశంలోని రోజువారీ కేసుల్లో సగానికిపైగా కేసులు ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర(Maharastra) రెండోస్థానంలో ఉంది. అక్కడ 5,225 మంది కోవిడ్ బారినపడ్డారు.


Also Read: India Covid: దేశంలో 40 శాతం పెరిగిన కరోనా కేసులు ..ఆ మూడు రాష్ట్రాల్లో జోరుగా..!


24 గంటల వ్యవధిలో 540 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మన దేశంలో మరణాల రేటు(Death Rate) 1.3గా ఉంది. దాంతో, మొత్తం కేసులు(Total Covid Cases) 3.23 కోట్లకు చేరగా.. 4,33,589 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం 3.63లక్షల మంది కొవిడ్‌(Covid)తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.12 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు(Recovery Rate) 97.54 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 36 వేల మంది కోలుకోగా.. మొత్తంగా వైరస్‌ను జయించినవారి సంఖ్య 3.15 కోట్లుగా ఉంది. 


57 కోట్ల టీకా డోసుల పంపిణీ:


జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం(Covid Vaccine Programme) ఈ మధ్య వేగం పుంజుకుంది. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 57 కోట్ల మార్కును దాటింది. నిన్న దేశవ్యాప్తంగా 54,71,282 మందికి టీకాలు వేశారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter Facebook