న్యూ ఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-29కే యుద్ధ విమానం గోవాలోని దబోలింకి సమీపంలో కుప్పకూలింది. అదృష్టవశాత్తుగా ఈ యుద్ధ విమానంలో వున్న ఇద్దరు ట్రైనీ పైలట్లు సకాలంలో విమానంలోంచి బయటికి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ దుర్ఘటన నుంచి సురక్షితంగా బయటపడిన ఇద్దరు పైలట్లను ఎం శియోఖండ్‌, లెఫ్టినెంట్ కేడర్‌కి చెందిన దీపక్ యాదవ్‌గా గుర్తించారు. గోవాలోని ఐఎన్ఎస్ హంస వైమానిక స్థావరానికి అనుబంధంగా శిక్షణ యుద్ధ విమానం ఇంజన్‌లో మంటలు అంటుకున్న కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ఇండియన్ నేవీ అధికారులు తెలిపారు.