రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ, పిరమాళ్ గ్రూప్ చీఫ్ అజయ్ పిరమాళ్ కుమారుడు ఆనంద్ నిశ్చితార్థం జరిగింది. ఇటలీ ఉత్తర ప్రాంతంలోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతాల్లో ఉన్న లేక్ కొమోలో ఆనంద్‌తో ఇషా నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల మధ్య అట్టహాసంగా జరిగిందని నివేదికలు తెలిపాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వేడుకకు అనిల్ కపూర్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా, ఆమె కాబోయే భర్త నిక్ జోనస్, కరణ్ జోహార్, డిజైనర్ మనీష్ మల్హోత్రా, శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకకు వీరేగాక పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరైనట్లు సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫోటోల ద్వారా తెలుస్తోంది. కాగా అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా అతిథులకు లేక్ కొమోలో పార్టీ ఇవ్వనుందని సమాచారం.


డిసెంబర్‌లో ఇషా-ఆనంద్ వివాహం జరగనుంది. ఈ ఏడాది మే నెలలో ఆనంద్ తన చిన్ననాటి స్నేహితురాలు ఇషాకు మహాబలేశ్వర్‌లో ప్రపోజ్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత ఇరు కుటుంబాలు లంచ్ పార్టీలో పాల్గొన్నాయి.