అమరావతి: అలనాటి అందాల తార స్వర్గీయ  శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ కపూర్ తన స్నేహితురాలితో కలిసి సోమవారం వేకువజామున కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరణ్ జోహార్ నిర్మించబోతోన్న 'గుంజన్ సక్సేనా' ది కార్గిల్ గర్ల్, 'రూహిఅఫ్జా' అనే రెండు చిత్రాల చిత్రీకరణలో జాన్వి బిజీగా ఉన్నారని చిత్ర బృందం తెలిపింది. 1999లో కార్గిల్ నుండి గాయపడిన సైనికులను విమానంలో ఎక్కించడంలో భారతీయ వైమానిక దళ పైలట్ 'గుంజన్ సక్సేనా' కీలక పాత్ర పోషించారు. రెండవది, హర్రర్ కామెడీ ఉంటుందని, ఇందులో జాన్వీ ద్విపాత్రాభినయం ఉంటుందని తెలిపారు.


కరణ్ జోహార్ నిర్మించబోతోన్న మరో ప్రతిష్టాత్మక చిత్రం, తఖ్త్ లో కూడా జాన్వీ నటించనుంది. ఇందులో కరీనా కపూర్ ఖాన్, రణవీర్ సింగ్, విక్కీ కౌషల్, భూమి పెడ్నేకర్, అనిల్ కపూర్ నటించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..