కమల్ చేసిన 'హిందూ తీవ్రవాదం' విమర్శలపై రోజురోజుకీ మాటలతూటాలు పేలుతూనే ఉన్నాయి. తాజాగా  కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై అఖిలభారత హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు  పి.టి.అశోక్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.    


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అశోక్ శర్మ మాట్లాడుతూ- "హిందూ తీవ్రవాదులుగా హిందూమతం యొక్క అనుచరులను వర్ణించిన కమల్ హాసన్ వంటి వ్యక్తులను కాల్చి చంపాలి. మతపరమైన ఎజెండాలో భాగంగానే.. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు" అని  మండిపడ్డారు. 


హిందూ వ్యతిరేక ఎజెండాతో ముందుకు సాగుతున్న కమల్ హాసన్ వంటి వ్యక్తులకు సరైనరీతిలో బుద్దిచెప్పాలంటే వారిని ఉరితీయడం లేదా కాల్చి చంపడం ఒక్కటే సరైనమార్గం. హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారు భారతదేశంలో నివసించడానికి హక్కు లేదని అశోక్ శర్మ చెప్పారు. అఖిల్ భారతీయ హిందూ మహాసభ కార్యకర్తలు కమల్ హాసన్ మరియు అతని కుమార్తె శృతి హసన్ చిత్రాలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు.