Kangana Ranaut News: పంజాబ్ లోని కీరత్ పురలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కారును కొందరు రైతులు అడ్డగించారు. చంఢీఘడ్ – ఉనా హైవైపై ఉన్న కీరత్ పుర సాహిబ్ వద్ద ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో రైతులు వచ్చి.. తన కారును అడ్డుకున్నారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కంగనా రనౌత్ కారుపై దాడి జరిగినట్లు తమకు సమాచారం అందలేదని రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ తెలిపారు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిశాకే దానిపై స్పందిస్తానని ఆయన అన్నారు.


క్షమాపణ చెప్పాలని డిమాండ్..


సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు ధ‌ర్నా చేస్తున్న స‌మ‌యంలో.. న‌టి కంగ‌నా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్య‌ల ప‌ట్ల క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని రైతులు డిమాండ్ చేశారు.


ఈ క్రమంలో నటి కంగనా రనౌత్ పంజాబ్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న నిరసన కారులు అడ్డగించారు. అయితే పంజాబ్ లోకి చేరుకున్న తర్వాత తన కారుపై ఓ గుంపు దాడి చేసిందని.. అయితే వాళ్లు రైతులమని చెప్పుకున్నట్లు ఇన్ స్టాగ్రామ్ లో కంగనా రనౌత్ వెల్లడించింది. 



Also Read: Viral Video: కదులుతున్న రైలు నుంచి దూకేసిన మహిళ.. ప్రాణాలతో కాపాడిన రైల్వే పోలీస్


Also Read: Omicron Variant: దేశంలో ఒమిక్రాన్ కలకలం..ఢిల్లీ ఆస్ప‌త్రిలో 12 మంది అనుమానితులు..!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook