బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ( Bollywood fire brand ) కంగనా రనౌత్ మరోసారి నిప్పులు చెరిగింది. ఈసారి ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికే సవాల్ విసిరింది. నీ అహంకారం నేలమట్టమవుతుందంటూ ఏకవచనంలో బెదిరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ( Sushant singh rajput ) మరణం నుంచి వివాదాస్పదంగా..సంచలనంగా మారిన కంగనా రనౌత్ ( kanganal ranaut ) ఇప్పుడు మరోసారి విరుచుకుపడింది. ముంబైలోని ఆమె ఇంటిని ధ్వంసం చేసిన వ్యవహారంలో ఆమె స్పందించింది. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ( Maharashtra cm Udhav thackeray ) ను ఏకవచనంతో సంభోధిస్తూ...సవాల్ విసిరింది. ఇవాళ నా ఇళ్లు ధ్వంసమైంది...రేపు నీ అహంకారం నేలమట్టమవుతుందంటూ ఛాలెంజ్ చేసి సంచలనం సృష్టించింది. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 


కంగనా రనౌత్ మాటల్లోనే


ఉద్ధవ్ ధాకరే నీవేమనుకుంటున్నావ్...సినీ మాఫియాతో కలిసి నా ఇళ్లు పడగొట్టి ప్రతీకారం తీర్చుకున్నాననుకుంటున్నావా..ఇవాళ నా ఇళ్లు ధ్వంసమైంది. రేపు నీ అహంకారం నేలమట్టమవుతుంది. ఇది కాలానుగుణంగా జరిగేదే..గుర్తుంచుకో..కాలం ఎప్పుడూ ఒకలా ఉండదు.


నా పై ఓ విధంగా నీవు మంచే చేశావనిపిస్తోంది. ఎందుకంటే నాకు తెలుసు కశ్మీరీ పండిట్లపై ఏం జరిగిందో. ఇవాళ నాకు అనుభవమైంది. నేను దేశానికి మాట ఇస్తున్నా...నేను అయోధ్యపైనే కాదు కాశ్మీర్ పై కూడా ఓ సినిమా తీస్తాను. నా దేశ ప్రజల్ని చైతన్యపరుస్తాను. ఎందుకంటే నాపై ఏం జరిగినా జరుగుతుంది. దీనివెనుక వేరే కారణాలున్నాయి. వేరే ఉద్దేశ్యాలున్నాయి. ఉద్ధవ్ ధాకరే..ఈ క్రూరత్వం..ఈ అరాచకం ఏదైతే ఉందో..నా పై జరగడం మంచికే అయింది. జై హింద్. జై మహారాష్ట్ర.