బెంగళూరు: ప్రముఖ మహిళా జర్నలిస్ట్ గౌరి లంకేష్ మర్డర్ కేసుపై కర్నాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ఆమెకు ప్రాణాలకు ప్రమాదముందన్న విషయం తమ దృష్టికి రాలేదని..ముందే తెలిసి ఉంటే ఆమెకు భద్రత కల్పించే వాళ్లమని వివరించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి రవిశంకర్ వ్యాఖ్యలు దారుణమన్నారు. ప్రభుత్వం ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించదని ఆయన చేసిన విమర్శ సరికాదన్నారు. భద్రత కావాలని ఆమె కోరి ఉంటే.. తగిన ఏర్పాట్లు చేసే ఉండే వాళ్లమని వెల్లడించారు. గౌరి లంకేష్ హత్యపై విచారణ చేపట్టేందుకు సిట్ ఏర్పాటు చేశామని ..త్వరలోనే హంతకులను పట్టుకుంటామని కర్నాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు.