Karnataka Tumkur Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లా శిర తాలూకాలో కల్లంబెల్ల సమీపంలోని బాలేనహళ్లి గేట్ వద్ద లారీ-టెంపో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో 14 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గురువారం (ఆగస్టు 25) తెల్లవారుజామున 4గం. సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతుల్లో ముగ్గురిని కష్ణప్ప, సుజాత, వినోద్‌లుగా గుర్తించారు. మిగతావారి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను మౌనిక, నాగమ్మ, నాగప్ప, దుర్గమ్మ, బాలాజీ, ఉమేష్, ఎల్లమ్మ, అనిల్, దేవరాజ్, వసంత్, వైశాలి, లిలితగా గుర్తించారు. ప్రమాద సమయంలో టెంపోలో మొత్తం 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.  వీరందరనీ లింగాసూరు, దేవదుర్గ వాసులుగా గుర్తించారు. కూలీలైన వీరంతా పని నిమిత్తం బెంగళూరు వెళ్తున్నట్లు గుర్తించారు. 


టెంపో రాయచూర్ నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా అదే మార్గంలో వెళ్తున్న లారీ వేగంగా దూసుకొచ్చి టెంపోని ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను తుమకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఎస్పీ రాహుల్ కుమార్ షాపూర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.


Also Read: Liger Twitter Review: ప్రేక్షకుల ముందుకొచ్చేసిన విజయ్ దేవరకొండ 'లైగర్'.. సినిమాపై ట్విట్టర్‌ రివ్యూ ఇదే..  


Also Read: Horoscope Today August 25th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook