Key Points of the Announcement In Latest Stimulus Package | కరోనావైరస్ వల్ల భారతదేశంలో అనేక రంగాలు కుదేలయ్యాయి. ఇలాంటి రంగాలను ఆదుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ మరో ఉద్దీపన ప్యాజీనీ ( Stimulus Package ) ప్రకటించింది. అందులో కీలక అంశాలు, రంగాలు ఇవే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. ఆత్మనిర్భర్ భారత్ పథకానికి చేయూత..
ప్రధానమంత్రి రోజ్ గార్ ప్రోత్సాహిక కార్యక్రమం మార్చి 31, 2019 వరకు అమలు చేశారు. ఇందులో లక్షా 52 వేల సంస్థలకు మొత్తం 8300 కోట్ల మేరకు లాభం కలిగింది.


ఈ సారి ప్రభుత్వం ( Indian Govt ) కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీనిపేరు ఆత్మనిర్భర్ భారత్ స్వయం ఉపాధి కార్యక్రమం( Atma Nirbhar Rojgar Yojana). ఈ ఫథకం ప్రకారం ప్రజలను EPFOలో చేర్చుతారు.
ముందు నుంచే ఈ  EPFOలో లేని వారిని మాత్రమే చేర్చుతారు. ఉన్నవారి వివరాలు తీసుకుంటారు...
మార్చి 1, 2020, నుంచి సెప్టెంబర్ 2020 మధ్య కాలంలో ఉద్యోగం కోల్పోయిన వారికి, అక్టోబర్ 1 నుంచి ఉద్యోగం లభించిన వారికి ఇందులో అవకాశం ఉంటుంది. అక్టోబర్ నుంచి ఆ పథకం ప్రారంభం కానుంది. రెండు సంత్సరాల వరకు కొనసాగుతుంది.


అవకాశాలు
 -EPFO ప్రకారం రిజిస్టర్ అయిన సంస్థలు కొత్తగా ఉద్యోగ ( Jobs) అవకాశాలు కల్పిస్తే వారికి ప్రయోజనాలు కలుగుతాయి.


- 50 మంది కన్నా తక్కువ ఉన్న సంస్థలు 2 కన్నా ఎక్కు మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు లాభం కలుగుతుంది.


- 50 ఎన్నా తక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు ఈ కార్యక్రమం నుంచి లబ్ధి పొండానికి 5 కన్నా ఎక్కు మంది ఉద్యోగులను నియమించాల్సి ఉంటుంది.


-EPFO లేని వారికి ఈ ప్రయోజనాలు కలగవు. వారు మందుగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది.


-ఇలా చేస్తే ఈ కార్యక్రమం వల్ల 2021 జూన్ 30 వరకు లబ్ధి పొందవచ్చు.


- ఇందులో రెండు రకాల ఉద్యోగాలు లభిస్తాయి. ఇందులో 1000 కన్నా తక్కువ ఉద్యోగులు ఉంటే, 12శాతం కంపెనీ నుంచి 12 శాతం ప్రభుత్వం నుంచి లాభం కలుగుతుంది.


-1000 మందికి పైగా ఉద్యోగులు ఉంటే ప్రభుత్వం కేవలం ఉద్యోగుల 12 శాతం మాత్రమే ఇస్తుంది. ఇది రెండు సంవత్సరాల వరకు అమలులో ఉంటుంది.


- ఈ పథకం నుంచి లాభం పొందాలి అంటే EPFO ఖాత తెరవాల్సి ఉంటుంది. 


- ఈ పథకంలో 95 శాతం సంస్థలు కవర్ అవుతాయి



This Story Is Updating...Please Refresh the Page