Muzaffarnagar Rape: ఉత్తరప్రదేశ్ లో రోజురోజుకు మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. ఇటీవలే ఓ మైనర్ బాలికను మత్తుమందు ఇచ్చి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన మరువక ముందే.. ఇప్పుడు ముజఫర్ నగర్ పదో తరగతి విద్యార్థినిపై నలుగురు దుండగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ట్యూషన్ కు వెళ్లిన విద్యార్థిని అపహరించి.. డ్రగ్స్ ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిందంటే?


బాలిక ఎప్పటిలాగే ట్యూషన్​ క్లాసులకు వెళ్లి తిరిగివస్తోంది. అక్కడే కాపు కాసిన ఇద్దరు దుండగులు ఆమెను అపహరించి సదపుర్​ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో ఇద్దరు వేచి ఉన్నారు. బాలికకు బలవంతంగా డ్రగ్స్​ ఇచ్చి నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.


బాలిక ఇంటికి రాకపోవటం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి కుటుంబ సభ్యులు. పోలీసులు, బంధువులు స్థానిక ప్రాంతాల్లో వెతకగా.. అపస్మారక స్థితిలో బాలిక కనిపించింది. మత్తు నుంచి తేరుకున్నాక తనపై జరిగిన దుశ్చర్యను కుటుంబ సభ్యులకు బాలిక వివరించింది.


నలుగురిపై కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్​ చేసినట్లు జన్సాథ్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ బబ్లూ సింగ్ వర్మ చెప్పారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.   


ALso Read: Farm Laws: 'ఎవరూ చేయలేని పనిని మోదీ చేశారు.. సాగు చట్టాలు మళ్లీ తెస్తాం'


Also Read: Thief Fires Bike: చలి మంట కాగేందుకు.. ఏకంగా బైక్‌నే తగలబెట్టిన దొంగ!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి