ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ పరిధిలోని మదిహన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు-ట్రాక్టర్ ఢీ కొట్టడంతో 10 మంది మృతిచెందారు. మరో 12 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.