సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే నటి, మోడల్ పూనమ్ పాండే. ఎప్పుడో ఏద సంచలనానికి తెరతీస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది పూనమ్ పాండే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమెపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబై సముద్ర తీరంలో ఆమె సరదాగా షికారు చేసింది. అందుకే పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సముద్రతీరంలో సరదాగా తిరిగితే తప్పేంటీ అంటారా..? దీని వెనుక అసలు కథ వేరే ఉంది. 


ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.  మే 17 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో  లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఎవరూ ఉల్లంఘించకుండా పోలీసులు  పగలు, రాత్రి పహారా కాస్తున్నారు. మరోవైపు కొంత మంది బయటకు వస్తూ లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో పోలీసులు అక్కడికక్కడే వారికి శిక్షలు కూడా విధించడం చూశాం. 


ఇప్పుడు మోడల్, నటి పూనమ్ పాండే కూడా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించింది.  ముంబై మెరైన్ తీరంలో సరదాగా షికారు చేసింది. దీంతో పోలీసులు ఆమె కారును అడ్డుకున్నారు. ఎక్కడి వెళ్తున్నారని ప్రశ్నించారు. కానీ సరైన కారణం చెప్పలేదు. దీంతో ఆమెపై లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 


ముంబై పోలీసులు.. పనమ్ పాండేతోపాటు ఆమెతో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి శ్యామ్ అహ్మద్ బాంబే పై  269, 188 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..