మానవ సంబంధాలు నెరపడంలో మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు మన ప్రధాని నరేంద్ర మోదీ. ఓవైపు కర్ణాటకలో అధికారం కోసం బీజేపీతో తీవ్ర స్థాయిలో పోటీ పడుతోన్న జనతా దళ్ సెక్యులర్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవె గౌడకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేసి మాట్లాడారు. రాజకీయ పోటీని పక్కన పెట్టి, ప్రస్తుత ప్రధాని హోదాలో మాజీ ప్రధాని అయిన దేవేగౌడకు ఫోన్ చేసి, అతడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ గారికి ఫోన్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాను. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ అభిలాషించారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీతో జత కట్టి బీజేపీపైనే పోరాటం చేస్తోన్న జేడీఎస్ అధినేత పట్ల అదే బీజేపీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనియాంశమైంది. మోదీ మార్క్ పాలిటిక్స్‌కి ఇది నిదర్శనం అని కొందరంటే, ఆయన సింప్లిసిటీకి ఇదో మరో ఉదాహరణ అని ఇంకొందరు మోదీని అభినందనల్లో ముంచెత్తుతున్నారు.