NEET PG 2024: నీట్ పీజీ పరీక్ష 2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 16న ప్రారంభమైన ఈ ప్రక్రియ మే 6 వరకూ కొనసాగనుంది. జూన్ 23వ తేదీన నీట్ పీజీ పరీక్ష జరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీట్ పీజీ 2024 పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు ఏప్రిల్ 16 నుంచి ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు. మే 6 వరకూ ఈ పక్రియ కొనసాగనుంది. మే 10 నుంచి మే 16 వరకూ దరఖాస్తుల సవరణకు అవకాశముంటుంది. మే 28 నుంచి జూన్ 3 వరకూ మొదటి దశలోనూ, జూన్ 7 నుంచి 10 వరకూ రెండో దశలో దరఖాస్తుల స్వీకరణకు చివరి అవకాశముంటుంది. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను జూన్ 18న విడుదల కానున్నాయి. జూన్ 23వ తేదీన నీట్ పీజీ 2024 పరీక్ష ఉంటుంది. ఇక జూలై 15వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. 


నీట్ పీజీ 2024 పరీక్ష ద్వారానే ఎండీ, ఎంఎస్, పీజి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలుంటాయి. ఎంబీబీఎస్ అనంతర డీఎన్‌బీ కోర్సులు, ఆరేళ్ల డీఆర్ఎన్‌బి కోర్సులు, ఎన్ బీఈఎంఎస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కూడా నీట్ పీజీ ఆధారంగానే ఉంటాయి. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైనవారు ఈ పరీక్షకు అర్హులు. నీట్ పీజీ 2024 పరీక్ష ఫీజు 3500 రూపాయలు కాగా, ఎస్టీ-ఎస్సీ దివ్యాంగులకు 2500 చెల్లిస్తే సరిపోతుంది. 


నీట్ పీజీ 2024 పరీక్ష 800 మార్కులకు ఉంటుంది. మూడు విభాగాల్లో 200 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులుంటాయి. మూడున్నర గంటల సమయముంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు 50 శాతం పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్ధులకు 40 శాతం పర్సంటైల్ సాధించాల్సి ఉంటుంది. 


Also read: Lok Sabha Polls 2024: తొలి విడత ప్రచారానికి తెర.. తమిళనాడు సహా 102 లోక్ సభ సీట్లకు రేపే పోలింగ్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook