Night Curfew in Karnataka : దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు (Omicron Cases in India)రోజురోజూకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) అప్రమత్తమైంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. మంగళవారం (డిసెంబర్‌ 28) నుంచి 10 రోజులపాటు కర్ఫ్యూను (Night Curfew in Karnataka) అమలు చేయనుంది. రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకూ  కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయి. ప్రస్తుతం కర్ణాటకలో 34 ఒమిక్రాన్ కేసులు (Omicron Cases in Karnataka) ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ఫ్యూ ఆంక్షలు: 


1. జనవరి 7 ఉదయం 10 గంటలు వరకు ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయి
2. న్యూఇయర్‌ వేడుకలతో పాటు బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను ప్రభుత్వం నిషేధించింది. 
3.  50 శాతం సీటింగ్‌ కెపాసిటీతో మాత్రమే హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు నిర్వహించుకోవాలి.
4. పరిశ్రమలకు, వాహనాలకు, అత్యవసరమైన కార్యకలాపాలకు. రోగులకు, హోమ్ డెలివరీలకు, ఇ-కామర్స్ సంస్థలకు మాత్రమే ఈ ఆంక్షల నుంచి మినహాయింపునిచ్చింది. 
5.  నైట్ షిఫ్ట్‌లలో పనిచేసే కంపెనీల ఉద్యోగులు చెల్లుబాటయ్యే ఐడీ కార్డ్‌తో తిరగవచ్చు.
6. ఎక్కడికైనా వెళ్లాలనుకునేవారి తగిన డాక్యుమెంట్స్, ప్రయాణ టిక్కెట్స్ ఉంటే ప్రయాణించవచ్చు. 
7. IT, ITeS కంపెనీల సిబ్బంది లేదా ఉద్యోగులు మాత్రమే ఆఫీసు నుండి పని చేయాలి,.మిగిలిన వారు ఇంటి నుండి పని చేస్తారు.


Also Read: Coronavirus: దేశంలో కొత్తగా 9,195 కరోనా కేసులు... 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు


ఒమిక్రాన్ నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఆంక్షల చట్రంలోకి వెళ్తున్నాయి. మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలుచేస్తున్నాయి.  రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు ఈ నిబంధనలు ఉంటున్నాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook