న్యూఢిల్లి: ప్రముఖ వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను రూ.14000 కోట్లకుపైగా మోసం చేసిన కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన నిరవ్ మోడీ లండన్‌లో అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించిన వివరాల ప్రకారం లండన్‌లోని హాల్‌బర్న్ మెట్రో స్టేషన్‌లో అరెస్ట్ అయిన నిరవ్ మోదీని పోలీసులు ఇవాళే అక్కడి కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం. భారతీయ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించినట్టుగా ఏఎన్ఐ ట్విటర్‌లో పేర్కొంది.